Wednesday, May 23, 2012

"సిరా"వెన్నెల సీతారామశాస్త్రి

తెలుగు సినీ గీతానికి అసుర సంధ్య అనదగ్గ సమయంలో ఉదయించి సిరివెన్నెల కురిపించిన చందమామ ఆయన.పైకి అందరికీ తేలికగా అర్ధమౌతూనే ఎంతో నిగూఢమైన భావ గాంభీర్యాన్ని కలిగిన కలం ఆయనది.ఆయనే సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా మారిన చేంబోలు సీతారామ శాస్త్రి.
                       "అడవిగాచిన వెన్నెల" అన్న సామెతని చమత్కారంగా "వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా"అంటూ మార్చిన చమత్కారం..ఆయన సొంతం."పడమర పడగలపై వెలిగే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరీ తూరుపు వేదికపై వేకువ నర్తకివై రాత్రిని వెలిగించే కాంతులు చిందనీ"అనే భావ గాంభీర్యం ఆయన వరం.
                      కె.విశ్వనాథ్ వల్ల వెలుగులో కి వచ్చిన చేంబోలు సీతారామ శాస్త్రి "సిరివెన్నెల" సినిమాలో అన్ని పాటలు ఘన విజయాలు సాధించడం వల్ల తేలికగా సినీ రంగం లొ స్థిరపడ్డారు అనుకుంటాము సాధారణం గా.కానీ సిరివెన్నెల తరువాత వచ్చిన అవకాశాలను ఆయన ఉపయోగించుకో లేకపోయారట.అప్పట్లో ఆయన ఇలాంటి పాటలే హిట్టవుతాయనుకునే దర్శకుల వల్లా,అక్కడకక్కడే రాయమనే నిర్మాతల వల్లా చాలా ఇబ్బంది పడ్డారుట.మెల్లిగా ఈయన సిరివెన్నెల లాంటి వాటికి తప్ప కమర్షియల్ సినిమాలకు పనికి రాడనే పేరు వచ్చేస్తోంది.సరిగా అప్పుడే దర్శకుడు వంశీ సిరివెన్నెలలో కమర్షియల్ గా రాస్తూ కవితాత్మను వదలని లక్షణాన్ని గమనించారు.దాంతో ఆయనకు కమర్షియల్ బాణీ అలవాటుచేశారు వంశీ.అలా వచ్చిందే లేడీస్ టైలర్.
                      ఇక వేటూరిలా అలవోకగా రాయలేని ఇబ్బందిని ఓ చిట్కా కనిపెట్టి పరిష్కరించుకున్నరు.అదే ఈవెనింగ్ సిట్టింగ్స్.సాయంత్రం సందర్భం చెప్పించుకుంటే రాత్రంతా టైం వస్తుందని కనిపెట్టారాయన. అలా సీతారామ శాస్త్రి హిట్టయ్యారు.
                       ఇదంతా వదిలి ఆయన పాటల గురించి చెప్పుకుందాం.సీతారామ శాస్త్రి పాటల్లో నేను గమనిచిన ప్రత్యేకత ఏంటంటే..అందరూ ఒప్పుకునే దాన్ని కాక వేరేదాన్ని చెప్తారు. అరే ఇదేంటి అని ఆశ్చర్యపోయే లోగా మనం కూడా అంగీకరించేంతటి వివరణ ఇస్తారు.దీనికి ఉదాహరణ ఎం.ఎస్.రాజు అనుభవాల్లోంచి చెప్పొచ్చు.మొదట్లో ఎం.ఎస్.రాజుకు సీతారామశాస్త్రి పట్ల మంచి అభిప్రాయం ఉండేది కాదు.కానీ "ఒక్కడు" మొదటి పాట ఎవరూ రాయలేకపోతే తప్పక సీతారామ శాస్త్రిని సంప్రదించారాయన.శాస్త్రి గారు తర్వాతి ఉదయం ఎం.ఎస్.రాజు గారికి పాట పల్లవి వినిపించడం మొదలుపెట్టారు."రాముణ్నైనా కృష్ణుణ్నైనా కీర్తిస్తూ కుర్చుంటామా"అన్నారు శాస్త్రి గారు."కాకపోతే ఏం చేస్తాం"అని ఆశ్చర్యపోయారు రాజు మొదటిలైనే యాంటీ సెంటిమెంటా అని.."వాళ్లేం సాధించారో కొంచం గుర్తిదాం మిత్రమా...సంద్రం కూడా స్తంభించేలా మనసత్తా చూపిద్దామా(రాముడు) సంగ్రామం లో గీతాపాఠం తెలుపమా(కృష్ణుడు)"అని పూర్తి చేసేసరికీ ఎం.ఎస్.రాజు అనుమానాలు పటాపంచలైనాయట.అప్పట్నించీ ఆయన ఆస్థాన కవి సిరివెన్నెలే.
సినిమాలో ఆయన రాసిన పాటలు ఎలాగూ తెలుస్తాయి కనుక మనకు తెలిసిన సిరివెన్నెలను వదిలి తెలియని సీతారామశాస్త్రి కవితలు కొన్ని చూడండి.
"అమృత మథనం" అనే కవితలో కొన్ని పంక్తులివి
"అసురులైన వారందరు 
అనిమేషులైన వారందరును 
అమృతత్వమందగా నెంచిరి 
యమపాశమను ప్రశ్న మడియించవలెనంచు 
జగతి జలధి మథియించిరి"
ఆ జగతి అను జలధి ఎలా ఉందటా
"సత్యమును అగాధమున నిల్పి 
సర్వవర్ణములు కలిపి 
శ్వేతార్ణమను భ్రాంతి గొలిపి 
ఆటుపోటుల బ్రతుకు కాచి వడబోసినది 
ఆటపాటల లోన పాప వలె తోచినది
జగతియను జలధి"
భారతీయ తత్వం గురించి ఆయన రాసిన గేయం ఇది.
యోగులు సాగిన మార్గమిది 
లోకములేలిన దుర్గమిది 
శాశ్వత శాంతుల స్వర్గమిది 
వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిది 


రాతికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరమ్ములనన్నిటికి 
మత మస్తకములు మతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది 
వినయము విద్యా భూషణమనుకొను విమల మనస్కుల నేల ఇది 
దురహంకారము దరి చేరని మహనీయ జీవనుల మార్గమిది 
సరళ జీవనము విరాట్ చింతనము అవిరళ సరళిగనెంచినది 
ఆద్యంతములకు అటునిటు నిలచిన ఆనందము పరికించినది  
గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగ నడిపించినది 
అజ్ఞానమునకు అందని ద్రష్టను కాంచిన కాంచన దుర్గమిది 


కాలుడు రేపిన చీకటి ధూళి 
రక్కసి మూకల కర్కశ కేళి 
విసరిన వికృత విష వలయమ్మున విస్మృతి పొందిన విభవమిది2 
పండిన పాపము పిండగ కేశవుడవతరించు సంకేతమిది 
హలాహలమ్ములను అరాయించుకును అమృత హృదయుల స్వర్గమిది
సీతారామశాస్త్రి గారు సాధారణంగా ఒకే పాటకు ఎన్నో వెర్షన్స్ రాస్తుంటారు.అలా "మనసంతా నువ్వే"లో "ఎవ్వరునెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమా" పాటకు ఆయన రాసుకున్న(సినిమాలో లేని) వెర్షన్ ఇది..
1:ఎన్నెనెన్నెన్నో రంగులతో కనిపిస్తుంది ఈ ప్రేమా 
రంగులకలలే కాంతి అని నమ్మిస్తుంది ఈ ప్రేమా 
వర్ణాలన్నీ కలిసుండే రవికిరణంకాదీ ప్రేమా 
తెల్లని సత్యం తానంటూ ప్రకటిస్తుంది ఈ ప్రేమా
2లైలా మజ్ఞూ గాధలనే చదివిస్తుందీ ఈ ప్రేమా 
తాజ్మహల్ తన కోట అని ప్రకటిస్తుందీ ఈ ప్రేమా 
కలవని జంటల మంటలలో కనిపిస్తుందీ ఈ ప్రేమా 
కలిసిన వెంటనె ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమా
3అమృత కలశం తానంటూ ఊరిస్తుందీ ఈ ప్రేమా 
జరిగే మధనం ఎంతటిదో ముందుగ తెలపదు ఈ ప్రేమా
ఔనంటూ కాదంటూనే మదిని మధించే ఈ ప్రేమా 
హాలాహలముకు నిలవండి చూద్దామంటుంది ప్రేమా
3ఇంతకుముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమా
ప్రతి ఒక జంటతొ ఈ గాధే మొదలెడుతుందీ ఈ ప్రేమా
సీతారాముల నేమార్చే మాయలేడి కద ఈ ప్రేమా
ఓటమినే గెలుపనిపించే మాయాజూదం ఈ ప్రేమా 
 మా గురువుగారు ఒకాయన సీతారామశాస్త్రి గారు సినిమాల్లో పేరు తెచ్చుకుంటున్న కాలంలో ఆయన గురించి ఒక కవిత రాసారు.ఆ కవితకు విస్మయం పొందిన శాస్త్రి గారి జవాబు కవిత ఇది.
"నీ కరుణా కటాక్ష వరమో
క్రోధారుణ దృగ్వీక్షణమో 
నీ కవితకు నేను అభిషక్తుడనో 
శబ్దాటవిన అభిశక్తుడనో
గీర్వాణీ నా జననీ ఏలా శోధించెదవు" 
కవిత రాసినది ఒక మనిషి కాదని అతనిలోని సరస్వతి అని భావించి.ఇది వరమా శాపమా అని ప్రశ్నించుకుంటున్నారు కవితాత్మకంగా.
-సూరంపూడి పవన్ సంతోష్
గమనిక: గతంలో ఈ పోస్ట్ నా బ్లాగులు పక్కింటబ్బాయి(ఇల్లుమారాడు), పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి)లలో ప్రచురించాను.

Tuesday, May 22, 2012


నన్ను కూడా చేర్చండీ....ప్లీజ్..








--
సుధారాణి పట్రాయని







www.illalimuchatlu.blogspot.com

www.yugalageetham.blogspot.com



hello

hello group :-)

--
Regards
Giridhar Sirigudi

పాటసారి


చిన్నప్పుడు జోలపాట ... కాలేజిలో సరదాపాట రచయతగా బతుకుపాట ..ఇలా తన జీవితంలో ఎన్నోపాటలువాటికోసం ఎన్నో పాట్లు ...

స్టేజ్ మీద నేను చేతిలో మైకు ఎదురుగా నాగార్జున ...ఆయన్ని చూడగానే ఏదో గుర్తొచ్చింది ..చెప్పాలనిపించింది ..మొదలుపెట్టాను ...చిన్నప్పుడు ఓ సారి మిమ్మల్ని చూద్దామని షూటింగ్ స్పాట్ కి వచ్చాను సెక్యురిటి వాళ్ళు తోసేసారు ...బురదలో పడ్డాను ..ఇంకోసారి అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట నిలబడ్డాను ..గూర్ఖా పొమ్మన్నాడు ..ఆ రోజే అనుకున్నాను ...ఎప్పటికైనా మీ సినిమాలకి పాటలురాయలని..అది నిజమైంది ...నాగార్జున నన్నే చూస్తున్నారు ...సారి .... భాస్కరభట్ల వాళ్ళకి నీ గురించి తెలిసి ఉండదులే అన్నారు నవ్వుతూ ....అవి నా జీవితం లో చాల ఉద్వేగభరిత క్షణాలు ...నా అభిమాన హీరో కళ్ళముందే ఉండటం ...అతని సినిమాకి పాటలు రాయడం ...ఇవన్ని 'పాట' నా కిచ్చిన బహుమానాలు ...జీవితంలో ప్రతి దశలోనూ ...నేను 'పాట'సారినే !

"విను నా మాట ...విన్నావంటే జీవితమంతా పువ్వుల బాట "...ఇది మా ప్రసాద్ బాబాయ్ చిన్నప్పుడు నన్నెత్తుకుని పాడినపాట ..ఇప్పటికి గుర్తుంది మా తాతగారు హరికథలు చెప్పేవారు .. అవి కొన్ని గుర్తే ..వీటితో పాటు వంశధార ఒడ్డున ఇసుకలో ఆటలు గుర్తున్నాయి నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోని బూరవిల్లి గ్రామం లో ...నాన్న భాస్కర శర్మ , అమ్మ విజయలక్ష్మి నాలుగోతరగతి వరకు అక్కడే ...ఆపై మేం రాజమండ్రి వెళ్ళిపోయాం ..అప్పటినుంచి గోదావరితో అనుబంధం ...కోటిపల్లి బస్టాండ్ దగ్గరలో మా ఇల్లు ..డీలక్స్ సెంటర్ మీదుగా నడిచేల్తే ...మా స్కూల్ చుట్టూ పే..ద్ద ప్రహరి గోడ ..దానిపై సినిమా పోస్టర్స్ ...ఉదయము సాయంత్రం వాటిని చూస్తూ నిలబడిపోయేవాణ్ణి .పోస్తేర్ల్లలో చాల పేర్లు ...వాటి మద్య వేటూరి ..సిరివెన్నెల ,భువనచంద్ర ... ఇవిమాత్రం చాల ఆకర్షించేవి ... ఎందుకో తెలియదు ... అందుకేనేమో తెలుగు పై మమకారం పెరిగింది కాదు కాదు ..కమలా టీచర్ పెంచింది ...హై స్కూల్ లో ఆవిడ తెలుగు పాఠాలు చెప్పేవారు ...ఎంతో ఆసక్తిగా వినేవాణ్ణి ..మరోపక్క మా తాతగారు ..వేమన పద్యాలూ సుమతి శతకం నేర్పించేవారు .. 

ఏడో తరగతిలో ఒక కవిత రాసాను ..అదీ మా స్కూల్ బ్లాకు బోర్డు మీద ...అది మా టీచర్ కి బాగా నచ్చేసింది ..ఓ పెన్ను ,పెన్సిల్ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు ..దానితో 'మనం కవి అయిపోయాము 'అనే ఫీలింగ్ .....రాయడం మొదలపెట్టాను ..అప్పట్లో రాజమండ్రి లో " సమాచారం,కోస్తా వాణి,గౌతమీ టైమ్స్ 'లాంటి స్థానిక పత్రికలు ఉండేవి కొన్ని కవితలు రాసుకుని వాటి ఆఫీసులకి వెళ్లి బాక్స్ లో పడేసి వచ్చేసేవాడిని .. మర్నాడు ఆశగా పత్రికలు చూసేవాడిని ..కాని ఏ ఒక్కటి ప్రచురణ అయ్యేదికాదు ..అయినా సరే రోజు అ బాక్స్లలో కవర్లు వేస్తూ ఉండేవాడిని ..ఓ రోజు ...గౌతమీ టైమ్స్ ఆఫీసు లో కవరు ఇస్తుంటే ఓ పెద్దాయన చూసారు 'ఏంటిది ' అని అడిగారు ..కవిత సార్ అన్నాను ...నువ్విచ్చిన కవితలు బోలెడు ఉన్నాయి లోపల వాటిని ఏం చేయాలో తెలియడంలేదు ...అయినా ..ఇది కవిత్వం కాదు ..అన్నారు లేదు ..లేదు ..ఇదే .. చూడండి ..లైను కింద లైను ..ఉంది ..ఇలాగే కవిత్వం రాస్తారు అన్నాను .అయన నవ్వుకుని ' నీకు శ్రీ శ్రీ తెలుసా ' అని అడిగారు ..అడ్డం గా తలూపా..శ్రీ శ్రీ ఎవరో తెలియకుండా ..కవిత్వం రాస్తావా ..? అన్నారు ..అప్పుడు మొదలయింది ..శ్రీ శ్రీ ..అన్వేషణ ..!

" నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వ సృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను ....."

మహాప్రస్థానం మొత్తం కంఠాతా వొచ్చేసింది ... శ్రీ శ్రీ కి వీరాభిమానిని అయిపోయాను ..పుస్తకాల పురుగునయిపోయాను .. అప్పుడు నేను టెన్త్ క్లాసు ..ఇదే హాబి ఇంటర్ల్లోను కొనసాగింది ..రోజులు గడుతుస్తున్నాయి .. కవర్ల్లకి స్టాంపులు అతికించి కవితలు పంపుతున్నాను ..పత్రికల్లో వస్తు ఉన్నాయి ...కొన్నాళ్ళకి ఎంతకాలం స్టాంపులకి,షేవింగ్ క్రీములకి డబ్బులిమ్మని ఇంట్లో అడగటం ?నా రచనలతోనే ఎంతో కొంత సంపాదించాలి అనుకున్నాను .ఎలాగైనా పాటల రచయిత కావాలన్న కోరిక నెమ్మిదిగా బలపడింది .. ఎంతగా అంటే...నేను చనిపోతే పత్రికల్లో ..." గేయ రచయత భాస్కరభట్ల కన్నుమూత " అని వార్త రావాలన్నంత ..!

బోటని పాఠాముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లేక్చరుంది మిస్టరి పిక్చరుంది సోదరా ఏది బెస్టు రా ....

కాలేజి రోజుల్లో ఈ పాట అంటే పిచ్చి ..! శివ చూసాక .నాగార్జున ,సిరివెన్నెల ,రామ్ గోపాల్ వర్మ ..లకు పెద్ద ఫ్యాన్ అయిపోయా..!హైదరాబాద్ వెళ్లి ..నాగార్జున సినిమాలకు పాటలు రాసేద్దామనిపించింది ...ఆపనే చేశా ..మా నాన్నగారి పాత ప్యాంటు సైజు చేయించుకుని .. కాళ్ళకి హవాయి చెప్పులేసుకుని అన్నపూర్ణ స్టూడియో గేటు ముందుకు వచ్చి అటు ఇటు తిరుగుతుంటే ..ఎవరో ఒకరు పిలిచి పాట రాయమని అడగక పోతారా అన్నా ధీమా ..!ఏయ్ ..బాబు ..అంటూ ఎవరో పిలిచారు ... చూస్తే.. వాచ్ మన్ ' ఇక్కడ ఉండొద్దు ' వెళ్ళిపో అన్నాడు ..ఎం చేస్తాం ..డొక్కు ప్యాంటు చెప్పులు అదోలా ఉంది ..మన అవతారం ..తిరిగి రాజమండ్రి వచ్చేసి ... మా నాన్నగారి స్నేహితుడి ద్వారా ' ఈనాడు ' లో విలేఖరి గా చేరాను ..ఓ పక్క కాలేజిలో చదువుకుంటూనే .కవి సమ్మేళనాలు ,సాహిత్యసభల వార్తలు రాస్తూ ఉండేవాణ్ణిరాజమండ్రి లో జరిగే షూటింగుల వార్తలు ' సితార 'కి రాస్తుండేవాడిని.. ఆ తర్వాత సితార రిపోర్టరుగా హైదరాబాద్ కి వచ్చా ...రిపోర్టరు ఉద్యోగం ..ఆపై పెళ్లి .. జీవితం గాడిలో పడింది కాని ..లక్ష్యం దారి తప్పింది ...ఏడేళ్ళు గడిచిపోయాయి ... పాట రాయాలన్న కోరిక ఏమైపోయింది ..నా లక్ష్యమేంటి ..నా ప్రయాణం ఎటువైపు సాగుతుంది ... అని ఓ సారి ఆత్మావలోకనం చేసుకున్నా ...ఉద్యోగం మానేద్దామనుకున్నా...ప్రయత్నాలు మొదలుపెట్టాను .. చాల మంది దర్శకులు చూద్దాం చేద్దాం అంటూ దాటేసేవారు ... చివరికి ఈ.వి.వి గారు 'చాల బాగుంది ' సినిమాకి ఓ పాట రాసే అవకాశం ఇచ్చారు ..ట్యూన్ ఇచ్చి రాయమన్నారు ... ఆ పాట ఓకే కాలేదు ..!తర్వాత 'గొప్పింటి అల్లుడు' లో ఓ పాట రాసాను ... తొలిసారి తెరమీద పేరు చూసుకుని మురిసిపోయాను .. కాని ఎక్కడో అసంతృప్తి .సినిమా బాగా ఆడలేదు .. ఆపై వరస ప్లాపులు ... నాకు సక్సెస్ కావాలి హిట్ సినిమాలకు రాశానన్న తృప్తి మిగలాలి ..దానికోసం పోరాటం సాగించాను ...

చినుకులన్ని కలసి చిత్ర కావేరి చివరికా కావేరి కడలి దేవేరి కడలిలో వెతకొద్దు కావేరి నీరు కడుపునిండా వెతకొద్దీ కన్నీరు కారు ఎండమావుల మీద ఎందుకా బెంగ గుండెలో దాగుంది గుట్టుగా గంగ 

ఇది శుభసంకల్పం లో వేటూరి గారు రాసింది ..ఈ పాట విన్నప్పుడల్లా ఉద్యోగం మానేసిననాటి రోజులు గుర్తొస్తాయి ..పాటలో వేటలో ఉద్యోగం మానేసా .. అప్పట్నుంచి కష్టాలు మొదలయ్యాయి .. అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.. చేతిలో డబ్బులుండేవి కావు .. పగలంతా పాటల పాట్లు .. రాత్రయ్యేసరికి నేను మా ఆవిడా కూర్చుని వివిధ పత్రికలకు వ్యాసాలు రాసేవాళ్ళం ..వాళ్ళిచ్చిన పారితోషికం తో రోజులు నేట్టుకోచ్చేవాళ్ళం ..అలాగని ఉద్యోగం మానేసి తప్పు చేశానని ఎప్పుడు నిరుత్సాహపడలేదు ..జీవితం ..చిన్నది ..కష్టాలు మరీ చిన్నవి ..కాబట్టి వాటిని వీలైంత త్వరగా అనుభవిస్తేనే తర్వాత సక్సెస్ వస్తుందని అనుకునేవాణ్ణి..అలాంటి ఓ రోజు రానే వచ్చింది .....

నా ధమనుల్లో సిరల్లో రక్తం కాదు ప్రవహిస్తుంది .. గోదావరి నీళ్ళు ..నా దేహం దేహమంతా గోదావరితో నిండిపోయింది ..నా జ్ఞాపకాల్లో గోదావరి ఎప్పుడు వాడిపోని పారిజాతమే ..ఇరిగిపోని గంధమే ..రాజమండ్రి వెళ్ళాలంటే గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కుతాను అందులో వెళ్తూ రాజమండ్రి చేరుకుంటుంటే నన్నెవరో అనాథ శరణాలయం నుంచి అమ్మ పొత్తిళ్ళలోకి చేరవేస్తున్నట్లు అనిపిస్తుంది ..డబ్బా పాలు విసిరేసి అమ్మ స్తన్యాన్ని గ్రోలడానికి ఆవురావురుమని వచ్చే పసిపిల్లాన్నైపోతాను ...

ఓ ఉగాది నాడు 'తనికెళ్ళ భరణి 'గారి ఇంట్లో జరిగిన కవి సమ్మేళనం లో నేను వినిపించిన కవిత భరణి గారికి బాగా నచ్చేసింది .. ఆ పక్కనే సంగీత దర్శకుడు చక్రి ఉన్నారు ...చక్రి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి ...నా దగ్గరకు వచ్చి ..."నేను రాజమండ్రి లో పుట్టి పెరిగి ఉండకపోవచ్చు ..కాని మీ కవిత నా హృదయాన్ని మీటింది మిమ్మల్ని రైటర్ గా పరిచయం చేస్తా .." అన్నారు అప్పటికే కొన్ని సినిమాలకు రాశానని,అవి ఫ్లాప్ అయ్యాయని చెప్పాను ..అయినా అయన నన్ను పూరిజగన్నాథ్ కి పరిచయం చేసారు ..వాళ్ళిద్దరి కాంబినేషన్ లో నాకో అవకాశం ఇచ్చారు .. అదే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ..అందులో 'రామసక్కని బంగారు బొమ్మ ' రాసాను ..అది హిట్ తరువాత ఇడియట్ ,అమ్మానాన్న తమిళమ్మాయి వరస హిట్స్ శివమణి లో 'ఏనాటికి మన మోకటేనని ' ... జల్సాలో గాల్లో తెలినట్లుందే ..పోకిరిలో ఇప్పటికింకా నా వయసు ...బంపర్ ఆఫర్ ...నచ్చావులే అన్ని పాటలు . ఇలా ఎన్నో హిట్స్ నా కెరీర్ లో నచ్చావులే ప్రత్యేకమైనది ...సితార లో రిపోర్టరుగా ఉన్నప్పుడు ఎప్పుడో మీటింగుల్లో రామోజీ రావు గారిని చూసేవాణ్ణిఆయనంటే చాల గౌరవం నాకు ...'నచ్చావులే ' ఆడియో రిలీజ్ ఫంక్షన్ నాడు అయన పక్కనే నిలబడ్డ ఆ "క్షణం" మరచిపోలేనిది 

వీడు చదువు వదిలేసి సాహిత్యం అంటున్నాడు ...కవిత్వమే జీవితం అంటున్నాడు ... అని చిన్నప్పుడు నాన్న నా గురించి టెన్షన్ పడేవారు కాని ..నాకు భవిష్యత్తు స్పష్టం గానే ఉంది ...ఏపనిలో నైన మొదట్లో వైఫల్యాలు వచ్చినప్పుడు కుంగి పోకూడదు అది మన ప్రయత్న లోపం గా భావించాలి ..సరిదిద్దుకోవాలి ..సాగిపోవాలి ...అప్పుడే విజయం 

నా అభిమాన సిని గేయరచయత " భాస్కర భట్ల రవికుమార్ "
.----------------------------------******--------------------------------------------------------
(ఈనాడు నుంచి )

కొండవీటి నాని

ఈ సినిమా చేయడం అంత వీజీ కాదు




సిలోన్ సుబ్బారావు తెలుసు కదా ..!
అలాగే ..పట్టు పద్మిని గుర్తుంది  కదూ ..!
ఇక గోపాలం ..యెల్ల  పాపారావు .... 
ఆకుల అనంతలక్ష్మీ ..
పెనుగొండ అబ్బులు ...
వీరందరిని ఎలా మరచిపోగలం చెప్పండి ...!

" శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్ " సినిమా ను గుర్తుచేసుకోగానే ... 
ఒకరి వెంట ఒకరు తెరలు చించుకుని మరీ మన మనసులోంచి బైటికొచ్చేస్తారు...! 
పాత్రలతో సహా సినిమాని గుర్తుపెట్టుకోవడమంటే ...అంత వీజీ కాదు ...
అలాగే ఈ నేపద్యంలో సినిమా తీయడం అంటే వీజీ కాదు ....
ఏదో " ఫ్రెండ్ షిప్ "  కొద్ది చెప్పాలంటే ..... ఇదంతా ... " వంశీ " ఆడిన స్క్రీన్ ప్లే ..!



ఏయ్ ..శివాజీ !
నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానోయ్..! అన్నారు వంశీ ...
ట్రాన్స్ ఫార్మర్  లో తల పెట్టినంత గా షాక్ అయ్యాడు ..శివాజీరాజా..!

అది  'మహర్షి ' సినిమా షూటింగ్ స్పాట్ ... అందులో హీరో రాఘవ కు స్నేహితుడు పాత్ర చేస్తున్నాడు శివాజీరాజా ... 
సగం పైగా షూటింగ్ అయ్యాక " ఓ మిట్టమధ్యానం " వేళ వంశీ కి శివాజీరాజా లో " హీరో " లక్షణాలు కనపడ్డాయి ..అప్పుడే డిసైడ్ అయిపోయాడు ..అతన్ని పెట్టి సినిమా చేయాలని..!
ఓ పక్క మహర్షి షూటింగ్ జరుగుతుండగానే తర్వాతి సినిమా కోసం కథ మొదలెట్టేసారు వంశీ.ఆయనకు చిన్నప్పుడు నుంచి రికార్డింగ్ డాన్సు లంటే చాల ఇష్టం .
ఆ నేపధ్యం లో  సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది ...
ఎందుకంటే ...
అ తరహ సినిమా అప్పటివరకు ఎవరు చేయలేదు ... 
తనికెళ్ళ భరణి,వేమూరి సత్యనారాయణ లతో కలసి కథను వండటం మొదలపెట్టారు ...
రికార్డింగ్ డాన్సులు ఆడే అమ్మాయి,అబ్బాయి ప్రేమించుకుంటారు ...పెద్దలకు తెలియకుండా గాంధర్వ వివాహం చేసుకుంటారు ...
ఇలా ఓ అందమైన ప్రేమకథగా స్క్రిప్ట్ తయారు చేశారు.భరణి డైలాగులు రాశారు..
ఈ కథకు " శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్ - రాజమడ్రి " అని టైటిల్ పెట్టారు ..." వంశీ "

నెల్లూరుకి  చెందిన ఇద్దరు డాక్టర్లు  విజయకుమార్ రెడ్డి ,రమేష్ రెడ్డి సినిమా తీస్తామంటూ వంశీని కలిసారు ..

" సరే ... కొత్త హీరో తో రికార్డింగ్ డాన్సుల నేపధ్యం లో  సినిమా చేద్దామా ..? అని అడిగారు .. వంశీ "

" మీ ఇష్టం ..అయితే మాకు ప్రొడక్షన్ గట్రా తెలియవు ..మీరే చూసుకోండి " అన్నారు డాక్టర్లు .." 

"అది నా వల్ల కూడా కాదు .. 

నిర్మాత స్రవంతి రవికిషోర్ నాకు మంచి స్నేహితుడు ఆయనకు అప్పజేబుదాంలె ,బాగా చూసుకుంటాడు .." అని భరోసా ఇచ్చారు ..వంశీ 

శిక్షణ కోసం శివాజీరాజా ను వైజాగ్ తీసుకెళ్ళారు ... 

హీరో కృష్ణ లాగ క్రాఫ్ చేయించారు ...

హీరోయిన్ గా భానుప్రియ చెల్లెలు నిశాంత (శాంతిప్రియ )ను తీసుకోవాలనుకున్నారు.



ఈలోగా " మహర్షి " సినిమా విడుదలై .. ఫెయిలైంది ... 

" ఏవండి మీకు కొత్త హీరోలు తో అచ్చి రాదేమో ..హీరోగా  రాజేంద్ర ప్రసాద్ ను తీసుకుందాం " అన్నారు నిర్మాతలు 

వంశీ ...ఏం మాట్లాడలేకపోయారు .

రాజేంద్రప్రసాద్ ,నిశాంత పై పోటో షూట్ చేసారు ,కథ కూడా మార్చేసారు..సీరియస్ సన్నివేశాలు తీసివేసి మొత్తం కామెడీతో నింపేసారు.

ఇళయరాజా ఆద్వర్యంలో ఐదుపాటలూ రెడీ అయిపోయాయి ...

షూటింగ్ మొదలపెట్టకముందే సరదాగా ఆడియో రిలీజ్ చేసేద్దాం ..అన్నారు వంశీ ..

అలా రాజేంద్రప్రసాద్ నిశాంత ఫోటోలతో ఆడియో మార్కెట్ లో విడుదలైంది ..!



ఇక్కడే కథ మరోసారి అడ్డం  తిరిగింది  ..ఆఖరి నిమషంలో హీరో హీరోయిన్ లు మారిపోయారు ...

నరేష్ ,మాధురి సీన్ లోకి వచ్చారు ... 

రికార్డింగ్ డాన్సుల్లో జూ"ఎన్టిఆర్ ,జూ'ఎన్నార్ &జూ"చిరంజీవి గా తూర్పుగోదావరి జిల్లాలో పేరొందిన వార్ని ఎంపిక చేసారు ...

మిగిలిన పాత్రలకు కోట శ్రీనివాసరావు ,తనికెళ్ళ భరణి ,రాళ్ళపల్లి ,వై.విజయ తదితరులు సిద్దమయ్యారు .



యూనిట్ అంతా రాజోలులో బస చేసారు ,ఆ చుట్టూ పక్కల ఊళ్లు శివకోడు ,మలికిపురం ,మోరి ,అంతర్వేది ,మానేపల్లి లో చిత్రీకరణ జరిపారు ...

షూటింగ్ దశలో ఏవేవో కొత్త ఆలోచనలు రావడంతో అప్పటికప్పుడు సంభాషణలు రాసి చిత్రీకరింప చేసారు  వంశీ .

ముందు రాసిన స్క్రిప్ట్టుకన్నా ,లొకేషన్ లో చేసిన మార్పులే ఎక్కువ ...

రికార్డింగ్ డాన్సు పాటలన్నీ ఆరు కెమెరాలతో తీసారు ...ఒక్కో కెమెరామన్ తో  ఒక్కోరకంగా షాట్ తీయమని చెప్పారు ...!

యూనిట్ లో వాళ్ళంతా ఇదేదో  కొత్తగా ఉందే అనుకున్నారు ..



కేవలం 22 రోజుల్లో   సినిమా పూర్తయి పొయింది ..

ఎందుకో టైటిల్ బాగా పెద్దదవుతుందని ,ఆఖరి నిమషంలో  " రాజమండ్రి " తీసేశారు .

1988 జూన్ నెలలో " శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్సు ట్రూప్ " విడుదలైంది.

ఎనభైలలో ఆంద్ర రాష్ట్రాన్ని ముఖ్యంగా కోస్తా జిల్లాలను ఊపేసిన రికార్డింగ్ డాన్సుల సంస్కృతి ని నేపద్యంగా తీసుకుని వంశీ చేసిన ఈ సినిమా ...

హాస్య చిత్రాలను ఇష్టపడే వారికి ఫుల్ మీల్స్ పెట్టింది ..

నిజానికి ..ఇలాంటి కథ తో సినిమా చేయడం సాహసమే ....

చివరి 20 నిమషాలు మినహాయిస్తే , " నవ్వకుండా ఈ సినిమా చూడటం అసాధ్యం ..!"

పూర్తి గా  డైలాగ్ కామెడి మీదే ఆధార పడ్డారు ... ప్రతి మాట తూటాలా పేలుతుంది ..



ఇందులో ప్రతి పాత్రకు దాదాపుగా ఊత పదాలు ఉంటాయి ...

" ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెపుతున్నాను " అంటూ మల్లిఖార్జున రావు 
" సీతతో అంత వీజీ కాదు " అంటూ తనికెళ్ళ భరణి 
"దొరబాబు ఉక్కేట్టవా ..!"అంటూ సంధ్య చెప్పే ... ఊతపదాలు ..కావలసినంత వినోదాన్ని పంచిపడతాయి ...

" ఇళయరాజా " పాత పాటల రీమిక్సు లు చేయడం ఎప్పుడు వినలేదు కదా ...ఆ ఏకైక అవకాశం ఈ సినిమా కలిగించింది ...
గూడచారి 116 లోని " నువ్వు నా ముందుంటే " 
మనుషులు మమంతలు లోని " సిగ్గేస్తుందా ..?" 
రాముడు భీముడు లోని " తెలిసిందిలే ....  
  
తెలిసిందిలే .... "


ఇలా వంశీ తన కిష్టమైన పాటల్ని చాల ముచ్చటగా రీమిక్స్ చేయించుకున్నారు ...


మాములుగా అయితే రీమిక్స్ కి " ఇళయరాజా " ఒప్పుకునేవారు కాదు ...


కథానుగుణంగా ఇక్కడ రీమిక్స్ అవసరం కాబట్టి చేయాల్సివచ్చింది ... 


ఈ సినిమా పాటల పని జరుగుతున్నప్పుడే " ఇళయరాజా " స్వాతిముత్యం రీరికార్డింగ్ చేస్తున్నారు ...


అందులో చక్రవాక రాగం లో  చేసిన ఓ థీం మ్యూజిక్ ..వంశీ కి విపరీతంగా నచ్చేసింది ... 


ఇళయరాజా ను బతిమిలాడుకుని ఆ థీం మ్యూజిక్ తో  " ఏనాడు విడిపోని ముడివెసేనో " పాట బాణీ కట్టించారు ...


( నాకు చాల చాల ఇష్టమైన సాంగ్ ఇది ..ఈ మధ్యనే నా  ఫ్రెండ్ చెల్లెలు పెళ్లి వీడియో ఎడిట్ కి ఈ సాంగ్ తో స్పెషల్ గా  ఎడిట్ చేసాను )

అలాగే  " ఆలాపన " లోని థీం మ్యూజిక్ తో " కలలా ..కరగాలా " పాట చేయించుకున్నారు ...!

పాటల్లో ,మాటల్లో ,తీతల్లో ...వంశీ మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది ..!
హరిఅనుమోలు కెమెరా కన్ను ఆ రికార్డింగ్ డాన్సు లని అద్భుతంగా తెరకెక్కించారు ..!
గోపాలం గా నరేష్ చలాకీగా కనిపిస్తారు ...సీతగా మాధురి ఎంపిక ఆ పాత్రకు కరెక్టే అనిపిస్తుంది ...!
ఇందులో అన్ని లైవ్ల్లి కేరేక్తర్సే ..ఒకరిని మించి ఒకరు బోలెడంత అల్లరి చేశారు ...!

కమలహాసన్ ఈ సినిమా టైటిల్ గురించి తెలుసుకుని తెగ ముచ్చట పడిపోయారు ...
ఎప్పుడో వంశీ ని  కలసినప్పుడు ఈ టైటిల్ గుర్తుచేసి  " భలే పెట్టారండి టైటిల్ " అని మెచ్చుకున్నారు ..!

" పెనుగొండ " (పశ్చిమ గోదావరి జిల్లా )నుంచి పాముల నాగేశ్వర రావు అనే అయన ట్రూప్ తో సహా వచ్చి మా ఊళ్ళో రికార్డింగ్ డాన్సు లాడారు ...
 అదే నేను మొదటిసారి చూడ్డం ..బాగా నచ్చేసింది ... ఆ నేపద్యంలో సినిమా తీయాలని అప్పుడే అనుకున్నా ..
 మొదట సీరియస్ గా తీయాలనుకుని ,తర్వాత కామెడి చేశాం ...! 
 ప్రేమకథను కామెడి డామినేట్ చేసేసింది ... 
 ఈ సినిమాకు సీక్వెల్ చేద్దామని నటుడు ప్రదీప్ శక్తి అడుగుతున్నారు ... 
అమెరికా లోని తాన సభలకు రికార్డింగ్ డాన్స్ ట్రూప్ వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన తో కథ చేద్దామనుకుంటున్నా! "
( వంశీ ..దర్శకుడు )

ఈ రోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం ..సందర్భంగా ....
మన " తెలుగు సినిమా పిచ్చోళ్ళు " కోసం ...!




కొండవీటి నాని

న్యూ జనరేషన్ కి ... " నువ్వే ..నువ్వే "



కొంతమంది మాటలకు ముత్యాలు రాలతాయి అంటారు . కాని త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలకు బాక్సాఫీస్ దగ్గర వజ్రాలే రాలతాయి ..చిలిపితనం ..తెలుగుతనం, మమకారం, వెటకారం, ...ఇంకా చెప్పాలంటే ... సూరేకారం నింపి టపాసులా పేల్చాడు "అతడు "ఏడెనిమిది సినిమాలకే మాటలు రాసి" నువ్వు నాకు నచ్చావ్ " ..పదికాలాలపాటు తెలుగు చిత్ర సీమకు "నువ్వేకావాలి "అనిపించుకున్నారు ..నేను మాటలు రాస్తాను కానీ ... మాట్లాడను అని చమత్కారంగా మాట్లాడే త్రివిక్రమ్ జీవితం లో ఎన్నో మలుపులున్నాయి .
త్రివిక్రమ్ అసలు పేరేంటో తెలుసా ?ఆకెళ్ళ శ్రీనివాస్ ...ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ' శ్రీనివాస్ ' అని పెడదామని నాన్న...'త్రివిక్రమ్' పేరు బాగుంటుందని పెదనాన్న వాడులాడుకున్నారట ....చివరకు నాన్న పంతమే నెగ్గింది ..అయితే సినిమాల్లోకి వచ్చాక తన కలం పేరు ' త్రివిక్రమ్ ' అని మార్చుకుని పెదనాన్న కోరిక నెరవేర్చారు ...

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కు చెందిన త్రివిక్రమ్ డి.ఎన్.ఆర్ కళాశాలలో డిగ్రీ , వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ లో ఎం.ఎస్.సి న్యూక్లియర్ ఫిజిక్స్ చదివారు ...కాలేజి రోజుల నుండే రోజు సెకండ్ షో చూడటం అలవాటు ..త్రివిక్రమ్ ఏనాడు సినిమా రంగానికి వెళ్తానని ఎవరి దగ్గర చెప్పలేదు అయితే అయన మనసులో దర్శకుడు కావాలనే అభిలాష ఉంది ...అందుకే 1996 లో హైదరాబాద్ చేరుకున్నారు ఇంట్లో మాత్రం ఉద్యోగం ప్రయత్నం కోసమని చెప్పారు .లకడికాపూల్లో ఓ రూమ్ అద్దెకు తీసుకుని జీవనోపాధికోసం హోం ట్యూషన్స్ చెపుతూ నెలకు 1500 సంపాదించేవారు అప్పుడు అయన రూమ్మేట్ సునీల్ .

ఓ రోజు రాత్రి మాసాబ్ ట్యాంక్ వైపు పచార్లు చేస్తుంటే హాస్య నటుడు గౌతమ్ రాజు తారసపడ్డారు ,పరిచయం పెరిగింది పద్మాలయ టెలి ఫిలిమ్స్ వారి ' మూవీ టౌన్ ' అనే సినిమా ఆధారిత కార్యక్రమానికి స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది, అది ఓ టి.వి.లో ప్రసారమైంది .

' రోడ్డు ' పేరుతో ఓ కథ రాసి ,నవలా రచయత కొమ్మనాపల్లి గణపతి రావు ను కలిసారు ..అయన కథ చదివి చాల బాగా రాసావ్ అని మెచ్చుకుని అప్పటికప్పుడు ఓ వార పత్రికకు ఆ కథ పంపించారు . అ కథ ప్రచురితమైనది కూడా ..కొమ్మనాపల్లి ద్వారా 'మెరుపు' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు ,అయితే నో శాలరీ ,అయినా రొజూ పరవాలేదని నాలుగు గంటల వరకు షూటింగ్ లో పాల్గొని ఆ తర్వాత ఇంటికి వెళ్లి ట్యూషన్స్ చెప్పేవారు .

గౌతంరాజు ద్వారా నిర్మాత టి.వి.డి ప్రసాద్ పరిచయమయ్యారు ..అప్పుడాయన ' అక్క బాగున్నావా ' సినిమా తీస్తున్నారు .. దానికి సరదాగా క్లైమాక్స్ రాసి తీసుకురమ్మన్నారు,తర్వాత రచయత పోసాని కృష్ణమురళి ని కలవమని చెప్పారాయన .

ఫోన్ చేయగా చేయగా ఎప్పుడో దొరికారు పోసాని ,చెన్నై రమ్మన్నారు 'ముద్దులమొగుడు' స్క్రిప్ట్ యిచ్చి డైలాగ్స్ రాయమన్నారు ..అప్పటికి త్రివిక్రమ్ కి డైలాగ్స్ ఎలా రాయాలో తెలియదు .పోసాని స్నానానికి వేల్లోచ్చే లోపు ఆ టేబుల్ పైన ఉన్న ఫైల్లో డైలాగ్స్ చూసి ఎలా రాయాలో అవగాహన ఏర్పరుచుకున్నారు.

1996 జులై నుంచి 21 నెలలు పోసాని దగ్గరే పనిచేసారు త్రివిక్రమ్ .పవిత్రబందం నుంచి శివయ్య వరకు అయన సహాయకుడిగా పనిచేసారు .

కృష్ణ వంశీ 'సముద్రం'సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు .వైజాగ్ లో షూటింగ్ చేస్తున్నారుశ్రీహరి, తనికెళ్ళ భరణి పై తీసే సన్నివేశానికి అర్జెంటుగా సంభాషణలు మార్చవలసివచ్చింది .సమయానికి మాటల రచయత శోభన్ అందుబాటులో లేరు,అప్పుడు అక్కడే ఉన్న త్రివిక్రమ్ ఆ సంభాషణలు రాసి యిచ్చారు .

వేణు , శ్యాంప్రసాద్ ఇంకొంతమంది స్నేహితులు ఉండేవారు ,సోమాజిగూడ లోని ఓ టీ స్టాల్ లో తరుచు కలుస్తూఉండేవారు .వాళ్ళ సంభాషణంతా సినిమాల గురించే .ఈ మిత్రబృందమంతా కలసి ' స్వయంవరం ' సినిమా మొదలెట్టారు కథ,మాటలు 'త్రివిక్రమ్ ' సినిమా విడుదలై హిట్టయింది .. అందరికన్నా త్రివిక్రమ్ కే ఎక్కువ పేరొచ్చింది ..ఎవరీ కుర్రాడు అంటూ ఆరాలు మొదలయ్యాయి .నాలుగైదు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి .కానీ త్రివిక్రమ్ ఎవరికి చెప్పకుండా ఎంచక్కా భీమవరం వెళ్ళిపోయారు ...మూడు నెలలు అక్కడే ఉండి కాలక్షేపం చేసోచ్చారు .. ఆ తర్వాత " నువ్వేకావాలి " మొదలైంది ..దానికి ఆధారం ' నిరమ్ " అనే మలయాళ సినిమా ... దాన్ని యధాతదంగా అనుసరించేయొచ్చు ... అలా చేసుంటే త్రివిక్రమ్ ఎందుకయ్యేవాడు ...రోజుకో వెర్షన్ రాసి చింపిపారేసేవాడు .. ఇంకా ఏదో కొత్తగా కావాలనిపించేది ..అలా తనకు నచ్చే వరకూ రాస్తూనే ఉన్నాడు ...అందుకే 'నువ్వేకావాలి ' సినిమా విడుదల అయ్యాక చాల మంది దర్శక నిర్మాతలు ' నువ్వేకావాలి "అని వెంటపడ్డారు 

సిరివెన్నెల సీతరామ శాస్త్రి గారి అన్నగారికి అల్లుడు కూడా అయిన త్రివిక్రమ్ కు పాటలు రాయడం కూడా వచ్చు ' ఒక రాజు ఒక రాణి ' లో అన్ని పాటలు ఆయనే రాశారుభవిష్యత్తు లో సాహిత్య గ్రంధం రాయాలనేది అయన కోరిక .నువ్వే నువ్వే తో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ దాని సంగీత దర్శకుడు కోటితో కలసి పాట పాడారు .. అత్యవసర పరిస్థితుల్లో కోరస్ సింగర్స్ లేక ఆ పాటలో గొంతు కలిపారు ...ఆతర్వాత అతడు ,జల్సా ,ఖలేజా చిత్రాలను డైరెక్ట్ చేసారు ...

రచయతగా ఒక ప్రత్యెక శైలిని చూపిన్చినట్లుగానే ,దర్శకుడి గాను తనకంటూ ఓ బాణీ ని అలవరచుకున్నారు 

తీసేది వాణిజ్య చిత్రమైన అందులో తప్పనిసరిగా వినోదం ఉండాలనేది అయన సిద్దాంతం .

ప్రస్తుతం అయన ...అల్లు అర్జున్ ఇలియానా జంటగా సినిమాని తెరకెక్కిస్తున్నారు ...



కొండవీటి నాని

డైరెక్టర్ శంకర్



డబ్బుతోనే సినిమాలు తీస్తారని అందరూ అనుకుంటారు .కాని ఆలోచన ఉంటె డబ్బు అదే వస్తుందని

" శంకర్ " కాన్ఫిడెన్సు .

శివాజీ సినిమాలో రజినీకాంత్ రూపాయి తో జీవితాన్ని మళ్లీ ప్రారంభిస్తాడు శంకర్ డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు అతని చేతిలో ఆ రూపాయి కూడా లేదు.అప్పటికి శంకర్ వయసు 29 ఏళ్ళు ....చేతిలో చిల్లర మాత్రమే ఉండి టి నగర్ రోడ్లు మీద నడుస్తూ ఆలోచిస్తున్నాడు సినిమా ఫీల్డ్ కి వచ్చి ఏడేళ్ళు అయింది అసిస్టెంట్ డైరెక్టర్ గా 17 సినిమాల అనుభవం వచ్చేసింది 'ఇక సినిమాలు చేయను '... అన్నాడు శంకర్ ... !ఫ్రెండ్స్ ఆశ్చర్యపోలేదు ..చిలిపిగా నవ్వారు ..డైరెక్టర్ అయ్యే వయసొచ్చేసింది నీకు ... అంటూ ఆటపట్టించారు .. ఏ కథ రెడీ చేస్తున్నావ్ ..అడిగారు " రజిని .. ముళ్లుం మలరం " నాకు నచ్చిన సినిమా .. ఆ టైపు లో ఏదైనా చేద్దామా అని ... అంటున్టుండగా .... ఇంకో ఫ్రెండ్ మద్యలో కట్ చేసాడు 'మీసాల కుంజు మోన్ కథ వింటున్నాడు ... బిగ్ ప్రొడ్యూసర్ ..ట్రై చేయి ..' సలహా ఇచ్చాడు శంకర్ మౌనం లో ఓ సందేహం 'అంతవరకు మైయిన్టినేన్స్ ..ఎలా ?ఫ్రెండ్స్ నిలబడిపోయారు ..రూమ్ రెంట్ ఒకలిచ్చేసారు ..మెస్ బిల్ ఇంకొకళ్ళు ..శంకర్ కథ రెడీ చేస్తుంటే ..ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసుకున్నారు ..శంకర్ మైండ్ స్పీడ్ గా పనిచేస్తుంది ఒకేఒక్క ఛాన్స్ ... గన్ షాట్ గా గెలవాలి ...

" సారి " ...మొదటిసారి కథ చెప్పినప్పుడు వినడానికి ఎవ్వరు ఇష్టపడని మాట ఇది ..కుంజు మోన్ మీసాలు సర్దుకున్నారు తరవాత చెప్పారు ...నీకు ఛాన్స్ ఇస్తాను కాని ఈ కథ కాదు వేరే యాక్షన్ కథ ఏదైనా చేయి ...కుంజు మోన్ ఆఫీసు నుండి బయటకొచ్చేసాడు .. నెలల తరబడి కష్టం ... తను ఇష్టపడి మొదట సినిమా చేద్దామనుకున్న స్క్రిప్ట్ " అళగియ పుయలే " ( అందమైన తుఫాను ) వర్క్ అవుట్ కాలేదు ... అయినా నిర్మాత ఇంకో ఛాన్స్ ఇచ్చారు కదా ..అది చాలు ...ఈ సారి మిస్ కాను ..కసిగా అనుకున్నాడు ..మళ్లీ కథ మొదలైంది ... ఈ సారి " జెంటిల్మన్ "తయారైయింది ...

జూలై 16 1993 
-------------------
కుంజు మోన్ ఆఫీసు కిటకిటలాడుతోంది ... శంకర్ డైరెక్షన్ లో మొదటి సినిమా జెంటిల్మన్ ఆ రోజు రిలీజ్ .. ఫోన్లు గ్యాప్ లేకుండా మోగుతున్నాయి ..అన్ని ఏరియాల నుంచి ఒకటే రిపోర్ట్ ..సినిమా సూపర్ డూపర్ హిట్ హీరో అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ .. ఏ .ఆర్.రెహ్మాన్ ..పాటలు హిట్ , ప్రభుదేవా చికుబుకు రైలే...ఐటెం సాంగ్ హిట్ ...నిర్మాత కుంజు మోన్ తన బోర మీసాలు సవరించుకున్నాడు " నాకు ఇంకో సినిమా చేయాలి " చేతిలో అడ్వాన్సు పెట్టాడు ... పీచు మిఠాయి ..అర్ద రూపాయి ..నువ్వుకోరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయిలు ...పీచు మిఠాయి లాంటి ప్రేమ కథకయినా లక్షరుపాయిలే కావాలంటాడు శంకర్ ..ప్రేమకథ కు ఇంత బడ్జేట్టా ? ..అది ప్రభుదేవా లాంటి బక్కపల్చటి కుర్రాడు హీరోనా ?అదీ అతనితో లవ్ స్టొరీ నా ? ఒక్క పాటకి ఆద్దాలతో బస్ తయారు చేయిస్తాడా ..?ప్రేమికుడు సినిమా కోసం శంకర్ చేసే పని మీద విమర్శలే ..శంకర్ కి మాత్రమే తెలుసు ...తనేం చేస్తున్నాడో ...!1994 లో ప్రేమికుడు సినిమా రిలీజ్ అయింది ...కలెక్షన్లు రాప్ డాన్సు చేసాయి ... ఆ రోజుల్లోనే 23 కోట్లు రూపాయల కలెక్షన్లు శంకర్ మీద ఎంత ఖర్చుపెడితే అంత లాభం ..అతని మీద ఎంత రిస్క్ చేస్తే అంత రిజల్టు ..మూస ఫార్ములాతో ,వరస ఫ్లాప్ లతో చితికిపోయిన చిత్ర పరిశ్రమని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో రీ ఛార్జ్ చేసాడు ...రెండు మెగా హిట్స్ తరవాత శంకర్ కి పొగరు పెరగలేదు ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు జాగ్రత్తగా అడుగులు వేయటం మొదలుపెట్టాడు ..తను కరెక్ట్ గా ఉండాలి ...అనుకున్నదే చేయాలి ...ఈ సారి ఎ.ఎం.రత్నం దగ్గరికి తనే వెళ్లి మీకో సినిమా చేస్తానని అడిగాడు .. శంకర్ కథ విన్నాడు రత్నం ..రజినీకాంత్ ,కమలహాసన్ లలో ఎవరైనా ఓకే అన్నాడు శంకర్ ..మొదట కమల్ కి కథ చెప్పారు శంకర్ ..ఆ కథని ఎలా తయారు చేసాడంటే ...కథ వింటున్నతసేపు కమల్ కి అది కథలా అనిపించలేదు ...చాలెంజ్ గా కనిపించింది ...కథ విని .. ఎస్ అన్నారు ..."మీకేమన్నా సందేహాలుంటే ఇపుడే చెప్పేయండి ..సెట్స్ లో ఇన్వాల్వ్ అయితే నేను సరిగా పనిచేయలేను " కమల్ కు ఖరాఖండి గా చెప్పాడు శంకర్ ..1996 లో రిలీజ్ అయిన " భారతీయుడు " సినిమాకి 13 కోట్ల రూపాయిలు ఖర్చయింది 32 కోట్ల రూపాయిలు వసూలు చేసింది కమర్షియల్ సినిమాకు కొత్త సక్సెస్ ఫార్ములాను సెట్ చేసింది " భారతీయుడు " సినిమా అంతకు ముందు సామాజిక రుగ్మతలు మీద సినిమాలు తీసిన దర్శకులు ఆర్ట్ సినిమా డైరెక్టర్ లుగా ముద్రపడ్డారు ..ఆ సినిమాలు స్లో సినిమాలుగా ముద్రపడ్డాయి ..కాని ...శంకర్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాడు తనదైన ఇమాజినేషన్ తో సోషల్ థీం కు కమర్షియల్ ఎలిమెంట్స్ జతచేసి ఒక సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగాడు ...

మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు ? అని అడిగిందో విలేఖరి ..." యాంటి కరప్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ " అని డెఫినెట్ గా చెప్పాడు శంకర్ ....

అవినీతి ..లంచగొండి తనం మీద అంతపెద్ద సినిమా తీసాక ...అనుకోని వరంలా ఐశ్వర్య రాయ్ శంకర్ ను వెతుక్కుంటూ వచ్చి మీతో సినిమా చేయాలనీ ఉంది అని చెప్పింది .. నిజానికి శంకర్ ప్లాన్ చేసింది ఫ్యామిలి ఎంటర్ టైనర్ .. ఓ మోస్తరు బడ్జెట్ లో తీసేయొచ్చు ...కాని శంకర్ ఎవరెస్ట్ ఎక్కే క్రమం లోనే ఉన్నాడు ..అడుగు కూడా కిందకి దిగే ఆలోచన లేదు జీన్స్ సినిమాలో రెండు డబుల్ రోల్స్ ..విపరీతమైన కంప్యుటర్ గ్రాఫిక్స్ వాడాలి అమెరికాలో పెద్ద షెడ్యూల్ ..అన్నిటికి మించి ఐశ్వర్య రాయ్ అతనికి ఎనిమిదో వింతలా అనిపించింది ..ఏడు వింతలున్న లోకేషన్లకు వెళ్లి వాటిముందు ఐశ్వర్య రాయ్ ని పెట్టి షూట్ చేయాలి ..ఒక్క పాటకోసం ...కోట్లు ఖర్చుపెట్టాడు ...

థింక్... బిగ్ అనుకుంటూ పనిచేస్తాడు శంకర్ ... గ్రో ...బిగ్ అంటూ దీవిస్తారు ..ఆడియెన్స్ ...

జెంటిల్మన్ తర్వాత ప్రేమికుడు ,భారతీయుడు తర్వాత జీన్స్ ఒకేఒక్కడు తర్వాత బాయ్స్...ఇలా ఒకటి సోషల్ థీం ...మరుసటి సినిమా ఎంటర్ టైనర్ ..శంకర్ ..ఒక సర్కిల్ లాంటివాడు ...ఒక్కోసారి ఒక ట్యాంజెంట్ లోకి వెళ్లి జీన్స్ ,బాయ్స్ లాంటి సినిమాలు తీస్తాడు ...వెంటనే మళ్లీ తనదైన సోషల్ థీం కు కమర్షియల్ ఎలిమెంట్స్ జతచేసి ఒక సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగాడు ...39 ఏళ్ళకు డైరెక్టర్ శంకర్ ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు ...ఎస్ .పిక్చర్స్ బేనర్ మీద సినిమాలు తీస్తూ ... నవ్యత ఉన్న కథలును సినిమాలుగా తీస్తూ కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నారు ....

మొదట " ఒకేఒక్కడు " కథ చెప్పినప్పుడు " రజినీకాంత్ " కాదన్నారు ..ఆ సినిమా చేస్తే పొలిటికల్ గా తన మీద అంచనాలు అమాంతం పెరిగిపోతాయన్నారు ..రెండోసారి " అపరిచితుడు " కథతో వెళ్తే ...నెగెటివ్ రోల్స్ చేస్తే .... అబిమానులు ఆదరించరని చెప్పారు ..శంకర్ తగ్గలేదు ... విక్రమ్ ని పిలిచి నువ్వే హీరో అన్నారు .. జుట్టు పెంచు ,కండలు పెంచు అని ఆర్డర్ వేసాడు ..అపరిచితుడు సినిమాలో ప్రతి సీను పండేలా చేసాడు ...ఒకే వ్యక్తిలో మూడు వ్యక్తిత్వాలు ,గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో కథను నడిపించాడు ... శంకర్ సినిమా పూర్తయ్యేసరికి సుమారు 36 కోట్లు ఖర్చయింది .. రిలీజ్ అయిన తర్వాత 65 కోట్లు పైగా వసూలు చేసింది ...మార్కెట్ ఎకానమి లో ప్రాతీయ సరిహద్దులకే పరిమితమైన రీజినల్ సినిమాని గ్లోబల్ మార్కెట్ లో నిలబెట్టిన వాడు .... " శంకర్ "లెక్క ప్రకారం సోషల్ థీం తో సినిమా అయింది కాబట్టి ఎంటర్ టైనర్ తీయాలి ...కాని ఎ.వి.ఎం .లాంటి ప్రఖ్యాత సంస్థ సినిమా చేయమని " శంకర్ " ని అడిగినపుడు అతను కండిషన్ పెట్టాడు .. " రజినీకాంత్ " ని ఒప్పించండి .. సినిమా చేస్తానన్నాడు ...ఎ.వి.ఎం అడిగితే కండిషన్ నా ? ...నిర్మాతలు రంగం లోకి దిగారు ...ఈసారి రజని ...ఎస్ అన్నారు ... 60 కోట్లు రూపాయల బడ్జెట్ అడిగాడు ...శంకర్ ... దానికి ఎస్ అన్నారు .... నిర్మాతలు శంకర్ చిరకాల స్వప్నం నెరవేరింది ... ఇప్పుడు రజిని ని డైరెక్ట్ చేస్తున్నాడు ...ఏడాదిన్నర పాటు తీరిగ్గా తీసాడు సినిమాని ...రిలీజ్ అయ్యాక " శివాజీ " 125 కోట్లు వసూలు చేసింది ...చైనా ,జపాన్ ,మలేషియా ,సింగపూర్ దేశాల్లో కూడా " శివాజీ " ఒక సంచలనం అయింది శంకర్ మీద ఎంత ఖర్చు చేస్తే అంత రాబడి ఉంటుందని మరోమారు రుజువైంది ...2001 ..నాయక్ ( హిందీ ఒకేఒక్కడు ) అయ్యాక ...కమల్ ,ప్రీతిజింటా జంటగా ... " రోబో " సినిమాని ఎనోన్స్ చేసాడు శంకర్ ...కాని నిర్మాతల వెనకడుగు వలన అది సాద్యం కాలేదు ...2007 లో షారుఖ్ ఖాన్ .. శంకర్ తో రోబో సినిమాని తాను నటిస్తూ ..నిర్మిస్తానని ముందుకొచ్చాడు కాని .. స్క్రిప్ట్ లో షారుఖ్ ఖాన్ .చెప్పిన మార్పులకు శంకర్ ఒప్పుకోలేదు ... ఈ సారి కూడా ... పనవలేదు ...కాని ఆ సబ్జెక్టు మీద నమ్మకం ఇంకా పెరిగింది ....శివాజీ సినిమా అయ్యాక ... ఈ కథని రజిని కి చెప్పాడు శంకర్ ...మారు మాట్లాడకుండా ... ఎప్పుడు ప్రారంభిస్తున్నావ్ అన్నారు రజిని ...జీన్స్ తరవాత అడిగిన ప్రతి సినిమా కాదన్న ఐశ్వర్య రాయ్ ..ఈసారి నో చెప్పాడని ఇష్టపడలేదు ...అందులోనూ రజిని పక్కన అనేసరికి ...వెంటనే డేట్స్ ఇచ్చేసింది .....ముందుగా అనుకున్న నిర్మాతలు ఎరోస్ ఇంటర్నేషనల్ & ayngaran ... 2008 లో వచ్చిన ఫైనాన్సియల్ క్రైసిస్ వలన ... తప్పుకోగా ..సన్ పిక్చర్స్ వాళ్ళు ... 165 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్దమయ్యారు ...ఆక్టోబర్ 1 2010 3000 స్క్రీన్ లు 2250 ప్రింట్స్ తో ప్రపంచ వ్యాప్తంగా .. విడుదల అయి ..సంచలన విజయం సాదించింది ... " రోబో "శంకర్ సినిమా ఒక సమోహనాస్త్రం ...సామజిక సమస్యలను .. ప్రతిభావంతంగా చిత్రీకరించడం ,చర్చించడం వాటికి తెలివైన ..ఆమోదయోగ్యమైన పరిష్కారాలు అందించడం అతడి స్టైల్ ...

జనం తమ సమస్యలను మర్చిపోవడానికి సినిమాలకు వస్తారు ...అవే సమస్యలను చాల అందంగా ... ఆలోచించే విధంగా ,అద్భుతంగా రూపొందించడం లోనే " శంకర్ స్టైల్ అఫ్ ఫిలిం మేకింగ్ " దాగుంది ..


"ది మేకింగ్ అఫ్ శంకర్ "
-------------------------
దర్సకత్వ శాఖలో 17 సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసారు శంకర్ పవిత్రన్ దగ్గర " మండే సూర్యుడు " కు కో డైరెక్టర్ గా చేసారు .. అసిస్టెంట్ గా అదే ఆఖరు సినిమా 

శంకర్ కు ప్రత్యేకంగా రైటర్స్ టీం ఉంది , స్టొరీ సిట్టింగ్స్ కి కొట్టాయం ,కన్యాకుమారి ,వైజాగ్ లాంటి చోట్లకు వెళ్తుంటారు ...ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు సిట్టింగ్స్ జరుగుతాయి మైయిన్ ఐడియా శంకర్ దే ...ఏమైనా బెటర్ మెంట్స్ చెప్పమంటారు ...10 గంటల తర్వాత ఎవరిష్టం వాళ్ళది ... మళ్లీ సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు సిట్టింగ్స్ జరుగుతాయి ...

పాటల చిత్రీకరణకు అందరూ 5 రోజులు తీసుకుంటే... శంకర్ మాత్రం 10 రోజులు తీసుకుంటారు నటీనటులను స్మూత్ గా హేండిల్ చేస్తారు ... కరెక్టుగా తనకేం కావాలో ఇంజెక్ట్ చేసి చేయించుకుంటారు .... అవసరమైతే తనే యాక్ట్ చేసి చూపిస్తారు ...

ఎ షాట్ అయినా 1 లేదా 2 టెక్స్ లోనే ఓకే చేసేస్తారు ...తీసిందే తీయడం ఆయనకు ఇష్టం ఉండదు సాదారణంగా షూటింగ్స్ లో కేకలు ,అరుపులు అధికం ....వేలమంది వర్క్ చేస్తున్నా ..శంకర్ షూటింగ్ లో హడావిడి ఉండదు ...మేకింగ్ అంతా కార్పోరేట్ స్టైల్ లో ఉంటుంది ....అసిస్టెంట్ కి కూడా మంచి వేతనాలు ఇచ్చే శంకర్ లో హాస్యప్రియత్వం ఎక్కువ ..!

ప్రేమికుడు సమయంలో తెలుగు బాగా నేర్చుకున్నాడు ..ఇప్పుడాయన చాల స్ఫష్టంగా తెలుగు మాట్లాడతాడు ...తెలుగు డబ్బింగ్ జరుగుతున్న దగ్గరికి వచ్చి వర్క్ ఎలా జరుగుతుందో గమనిస్తారు ...ఫలానా పాత్రకు ఫలానా వాయిస్ సూట్ అయిందో లేదో చూస్తారు ...

స్క్రిప్ట్ ఒకసారి పక్కా అయ్యాక మళ్లీ మార్పులు చేర్పులు అంటూ ఉండవు ..భారతీయుడు లో ఒకేఒక్క షాట్ మాత్రం అప్పుడుకప్పుడు మార్చారు ..పచ్చని చిలకలు తోడుంటే ... అనే పాటలో 500 రూపాయల నోట్లతో పడవలు చేసి నీళ్ళలో వదులుతారు కదా .. అది నిర్మాత రత్నం ఆలోచన ..బాగుందని శంకర్ తన ఆలోచన పక్కన పెట్టేసి ఇది వాడారు ....శంకర్ బలం - నగర జీవితం లో ఆణువణువూ తెలియడం ...బలహీనత - పల్లె జీవనం అస్సలు పరిచయం లేకపోవడం శంకర్ పుట్టింది కుంభకోణం అయినా పెరిగింది మాత్రం చెన్నై లో ...

చిన్నతనం నుండి సంగీతం అంటే పిచ్చి ..పెళ్లిళ్లకు పెట్టె కచేరీలకు తరుచు వెళ్తూఉండేవాడు ... ఇంట్లో బకెట్స్ , బిందెలు బోర్ల వేసి డ్రమ్స్ వాయిస్తూ అమ్మతో తిట్లు తినేవారు ... భూతద్దం సహాయం తో రోడ్డు పై దొరికే పాత ఫిలిం లను ఏరుకొచ్చి చూసేవారు ...

ఎస్ .ఎ .చంద్ర శేఖర్ ( హీరో విజయ్ ఫాదర్ ) దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ అడపాదడప వేషాలు వేసారు సీతా అనే సినిమాలో ఫుల్ లేన్త్ కామెడి చేసారు .. అది కాస్త ఫ్లాప్ అవడం తో నటుడు కావాలనే నమ్మకం పోయింది ...శివాజీ లో బల్లెలక్క పాటలో ...అలా చమక్ మని మెరిసారు ..ఒకసారి షూట్ లో ఎవరో ఆర్టిస్ట్ సెట్ లోకి రాలేదని ... కోపం తో క్లాప్ బోర్డ్ శంకర్ మీదకి విసిరారట చంద్రశేఖర్ ..దెబ్బ తగిలి రక్తం వస్తుంటే .. క్లాప్ బోర్డ్ తుడిచే క్లాత్ తో తుడుచుకుంటూ ... ఆ ఆర్టిస్ట్ ని పిలవడానికి వెళ్లారట ..శంకర్ ..

దర్శకుడు గా తీసుకున్న తొలి అడ్వాన్సు తో అమ్మకు జత బంగారు గాజులు , కలర్ టి.వి కొన్నారు .18 ఏళ్ళ వయసులో ఓ టైపు మిషన్ల కంపెనీ లో క్వాలిటీ కంట్రోలర్ గా ఉద్యోగం చేసారు ...నాలుగున్నర ఏళ్ళకు పర్మిట్ చేయటం అనేది ఆ కంపనీ రూల్ ,కాని మూడేళ్లకే ఏదో వంకతో పంపించేస్తారు .ఈ విషయం తెలిసి శంకర్ యాజమాన్యం పై తిరగబడ్డారు ..దాంతో చెన్నై సెంట్రల్ జైలు లో మూడు రోజులు ఉంచారు .

ఇప్పటివరకు భారతీయ సినిమా తయారీదారులు అడుగుపెట్టని స్టూడియో ...." స్టాన్ విన్స్ టన్ యానిమేషన్ స్టూడియో " టెర్మినెటార్ ..జురాసిక్ పార్క్ ..అవతార్ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాల యానిమేషన్ వర్క్స్ ఈ స్టూడియో లోనే మన భారతదేశం నుంచి మొట్టమొదటి సారిగా " రోబో " యూనిట్ ఈ స్టూడియో లో అడుగు పెట్టింది రోబో చిత్రం క్లయిమాక్స్ లో హీరో రజినీకాంత్ ,హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ,విలన్ రోబో రజినిలు పాల్గొనగా ఓ భారి ఫైట్ ఉంటుంది ... హీరో రజినీకాంత్ తో పోరాడటానికి 100 రోబోట్లు వరసగా వస్తాయి ...ఈ వంద రోబోల సృష్టి కోసం " స్టాన్ విన్స్ టన్ యానిమేషన్ స్టూడియో " లోని యాని మేట్రిక్స్ టెక్నాలజీని ఆశ్రయించారు శంకర్ ....వాళ్ళు ...ఈ క్లయిమాక్స్ కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పూర్తవ్వడానికి దాదాపు 8 నెలలు పడుతుందన్నారు అందుకని రోబో షూటింగ్ ఆరంభించినప్పుడే క్లయిమాక్స్ ని చిత్రీకరించారు ..శంకర్ ..

సినిమాల ద్వారా ఇచ్చే సందేశాల వలన దేశం లో రాత్రి కి రాత్రి మంచి మార్పులు జరుగుతాయని నేనడంలేదు .. కాని వ్యవస్థలో మార్పు రావాలంటే ... కొన్ని సంవత్సరాలు పడుతుంది ... కాకపోతే తన సినిమాల ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశం ఇవ్వడానికి ....ప్రయత్నిస్తున్న నా అభిమాన దర్శకుడు ... " శంకర్ " అభినందనీయుడు ...!


కొండవీటి నాని